NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యాపిల్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: యూఎస్ టెక్నాలజీ దిగ్గజం, ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ కీలక ప్రకటన చేసింది. ఇటివలే మార్కెట్లో విడుదలైన ఐఫోన్ 14 ఉత్పత్తిని భారత్‌లో మొదలుపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది. సరికొత్త సాంకేతికతలు, కీలక భద్రత సామర్థ్యాలతో రూపొందించిన ఐఫోన్ 14 తయారీని ఇక్కడ మొదలుపెట్టడం పట్ల ఆనందంగా ఉందని పేర్కొంటూ సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. కాగా యాపిల్ కంపెనీకి ప్రస్తుతం భారత్‌లో ఫాక్స్‌కాన్ ప్రధాన తయారీదారుగా ఉంది. తమిళనాడులోని చెన్నై శివార్లలోని శ్రీపెరుంబుదూర్‌లో ఐఫోన్ల ఉత్పత్తి జరుగుతోన్న విషయం తెలిసిందే.

                                          

About Author