NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దరఖాస్తుదారులకు ఆహ్వానం…

1 min read

– ప్రభుత్వ నిబంధనలు, ఉత్తర్వులనుసరించి లైసెన్సులు మంజూరు..

– ఆర్.డి.ఓ ఖాజావలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండలాల నందు తాత్కాలికంగా దీపావళి బాణాసంచా సామాగ్రిని అమ్ముకొనుటకు తాత్కాలిక లైసెన్స్ కొరకు  దరఖాస్తులు కోరుతున్నట్లు ఏలూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ధరఖాస్తు చేసుకొనే వారు అక్టోబరు 13 నుండి అక్టోబరు 31వ తేదీ లోపు ఏలూరులోని రెవిన్యూ డివిజనల్ అధికారివారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.  ధరఖాస్తుతో పాటు దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్,పాన్ కార్డ్,చలానా ఒరిజినల్ మరియు దరఖాస్తుదారుడు తప్పనిసరిగా జిఎస్ టి చెల్లించి సదరు రసీదును జతపరచాలన్నారు. సదరు లైసెన్స్ మంజూరు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశములు,ఉత్తర్వులును అనుసరించి లైసెన్సులు మంజూరు చేయబడునని డిఆర్ఓ ఒక ప్రకటనలో తెలిపారు.

About Author