PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రూప్ 1 ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఉద్యోగాల దరఖాస్తు గడువును పెంచింది. గ్రూప్ 1 పోస్టులకు 2022 నవంబర్ 2న దరఖాస్తు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీపీఎస్‌సీ 2022 నవంబర్ 5 వరకు దరఖాస్తు గడువును పొడిగించింది. అభ్యర్థుల నుంచి అభ్యర్థనలు రావడంతో దరఖాస్తు గడువు పొడిగించినట్టు ఏపీపీఎస్‌సీ తెలిపింది. గ్రూప్ 1 పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ 2022 సెప్టెంబర్ 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆసక్తి గల అభ్యర్థులు గ్రూప్ 1 పోస్టులకు అప్లై చేయడానికి మరో మూడు రోజుల గడువు ఉంది. అభ్యర్థులు 2022 నవంబర్ 4 అర్థరాత్రి 11:59 గంటల్లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 ఖాళీలను భర్తీ చేస్తోంది ఏపీపీఎస్‌సీ. అందులో డిప్యూటీ కలెక్టర్- 10, అసిస్టెంట్ కమిషనర్- 12, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్- 13, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్- 2, డివిజనల్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్- 2, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్- 8 పోస్టులున్నాయి.

About Author