పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలు సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలి
1 min read
అర్జీల పరిష్కారానికి మానవత ధృక్పదంతో వ్యవహరించాలి
పిజిఆర్ఎస్ లో 312 అర్జీలు రాక
చింతలపూడి లో నిర్వహించిన పిజిఆర్ఎస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,
చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రజలు ఎదుర్కొంటున్న వివిధసమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్ధ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. సోమవారం చింతలపూడి తహశీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్ధ(పిజిఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తో పాటు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్ పాల్గొని ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి రూరల్, అర్బన్ తో పాటు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలోసమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా ఫిర్యా దుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజలు అందించే అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తనకు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. లింగపాలెం మండలం దర్మాజీగూడెం కు చెందిన పి.రాజేశ్వరరావు తమ గ్రామంలో యల్లసముద్రం అనే చెరువు ఉన్నదని, ఆ చెరువు మట్టితోను,చెట్లతోను నిండిపోయి నీరు నిల్వచేయడానికి ఆటంకంగా ఉన్నది. కావున చెరువులో పూడిక తీయాలని కోరుతూ అర్జీ అందజేశారు. చింతలపూడి మండలం, చింతలపూడి గ్రామస్ధుడు బి. రమణ గ్రామంలోని ఇళ్ల కాలనీలోని రోడ్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అర్జీ అందజేశారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం కు చెందిన కె. ఇస్సాకు తమ గ్రామ సర్వేనెం. 260.2 లో తనకు 0.35 సెంట్లు భూమి ఉన్నదని డిస్టిబ్యూట్ రిజిష్టర్ నందు నమోదుచేసి ఉన్నారని,కావున నాభూమిని డిస్టిబ్యూట్ రిజిష్టర్ నుండి తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశారు. చింతలపూడి మండలం ఎడ్లపల్లి గ్రామం యం.సత్యనారాయణ తన భూమి పంటకాలువ అని నమోదు కాబడినదని, దీనిని మార్పు చేయవల్సిందిగా అర్జీ అందజేశారు. టి.నర్సాపురంనకు చెందిన పసుమర్తి రాము తన దరఖాస్తులో చింతలపూడి నుండి టి. నర్సాపురంనకు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు గోతులతో ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ప్రతీరోజు ద్విచక్ర వాహన ప్రమాదాలు జరుగురుతున్నాయని, ప్రమాదాల నివారణకు రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు. సమస్య ను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని రహదారులు, భవనాల శాఖ ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు.కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పిడి ఆర్.విజయరాజు,డి సి వో శ్రీనివాస్,జడ్పీ సీఈఓ భీమేశ్వరరావు,డి ఎస్ పి రవిచంద్ర,బీసీ కార్పొరేషన్ ఈడి ఎన్.పుష్పలత,జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్వి నాగరాణి,డి సి హెచ్ ఎస్ పాల్ సతీష్ కుమార్, ఎల్ డి యం డి.నీలాద్రి,జిల్లా హౌసింగ్ అధికారి జి.సత్యనారాయణ,ఎస్ సి కార్పొరేషన్ ఈడీ యం.ముక్కంటి వివిధ శాఖల జిల్లా అధికారులు, యం పి డి వో యం.మురళీకృష్ణ, తహసీల్దార్ ప్రమద్వర,మున్సిపల్ కమిషనర్ ఏ.రాంబాబు,స్దానిక ప్రజా ప్రతినిదులు, పెద్ద సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు.