PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పదోన్నతపై ఏపీజిఎల్ డిడి గా కె ఎస్ వి  వరప్రసాద్ నియామకం..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో గల జీవిత బీమా కార్యాలయం (ఏపీజీఎల్) కి ఒంగోలు బీమా కార్యాలయంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న కెఎస్ వి వరప్రసాద్ పదోన్నతి పై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమా కార్యాలయానికి ఉపసంచాలకులుగా నియమితులయ్యారు. ఆయనకు కార్యాలయ  సూపరిoటెండెoట్స్  మద్దంశెట్టి శ్రీనివాసరావు, మేడేపల్లి వరకుమార్, మరిడి రామకృష్ణ, రాళ్లపల్లి రాజేష్, సంక్రాంతి వినాయక్ మరియు ఔట్సోర్సింగ్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు. వరప్రసాద్ మాట్లాడుతూ విది నిర్వహణలో మనందరం కలిసి పనిచేసి కార్యాలయానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

About Author