PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్త ఎల‌క్షన్ క‌మిష‌న‌ర్ నియామ‌కం

1 min read

అమ‌రావ‌తి: ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త ఎల‌క్షన్ క‌మిష‌న‌ర్ ను నియ‌మించింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప‌ని చేసిన నీలం సాహ్ని ని కొత్త ఎస్ఈసీ గా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాద‌న‌ను గ‌వ‌ర్నర్ బిశ్వభూష‌ణ్ హ‌రిచందన్ ఆమోదించారు. ప్రస్తుత ఎస్ఈసీ గా ఉన్న నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్ ప‌ద‌వీ కాలం ఈ నెలాఖ‌రున ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీ నియ‌మాకాన్ని పూర్తీ చేసింది. నీలం సాహ్ని తో పాటు, ప్రేమేంద‌ర్ రెడ్డి, శామ్యూల్ ల పేర్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే.. నీలం సాహ్ని ఎస్ఈసీగా ఎంపిక‌య్యింది. ఇటీవ‌లే ఆమె ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శిగా కూడ ప‌నిచేసి.. ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

About Author