PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ అమ్మాయిల్ని అభినందిస్తున్నా : చిరంజీవి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మెగాస్టార్ చిరంజీవిని యువ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మన్యపు, పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్ కలిశారు. తన నివాసానికి వచ్చిన వారిని చిరంజీవి మనస్ఫూర్తిగా అభినందించారు. వారి ఘనతల వివరాలను తెలుసుకున్నారు. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. “ప్రతి అమ్మాయిలోనూ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆ విషయాన్ని ఈ ఇద్దరు డైనమిక్ యువతులు డాక్టర్ కావ్య మన్యపు, పూర్ణా మాలావత్ నిరూపించారు. అణగారిన వర్గాల బాలికలను విద్య, చైతన్యం, సాధికారిత దిశగా నడిపించేందుకు వీరిద్దరూ ప్రాజెక్ట్ శక్తి చేపట్టారు. అందుకు వారి ప్రయత్నాలను అభినందిస్తున్నా” అని తెలిపారు. ఈ మేరకు కావ్య, పూర్ణలతో దిగిన ఫొటోలను కూడా చిరంజీవి పంచుకున్నారు.

                                      

About Author