PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీపీఎస్​సీ ఏఈ ఉద్యోగాల నోటిఫికేషన్​ విడుదల!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: ఆంధ్రపదేశ్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ అసిస్టెంట్​ ఇంజనీర్ల పోస్టులు భర్తీ చేసేందుకు బుధవారం నోటిఫికేషన్​ జారీ చేసింది. మొత్తం 190 ఏఈ ఉద్యోగాల నియామకానికి అక్టోబర్​ 21నుంచి నవంబర్​ 11వ తేదీ దాకా ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. జులై 2021నాటికి 18–42ఏళ్లు నిండిన అభ్యర్థులు స్టేట్​ బోర్డు ఆఫ్​ టెక్నికల్​ ఎడ్యూకేషన్​ అండ్​ ట్రైనింగ్​ ద్వారా జారీ చేయబడిన డిగ్రీ, సంబంధిత ఇంజనీరంగ్​ విభాగాల్లో డిప్లోమా, లేదా యూఎస్​, ఎల్​సీఈ, ఎల్​ఎంఈ, ఎల్​ఏఈ, ఎల్​ఎస్​ఈ, డీసీఈ డిప్లోమా అర్హత ఉన్న అభ్యర్థులు సదరు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు రుసుం రూ.250తోపాటు పరీక్ష రుసుం రూ.80 చెల్లించాల్సి ఉంటుంది.

About Author