PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపిఆర్ఎస్ఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కె రమేష్ కుమార్

1 min read

ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, సంఘానికి అండగా నిలవాలి..

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డి ఆర్ ఓ ని మర్యాద పూర్వకంగా కలిసిన కె.రమేష్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA) రాష్ట్రా జనరల్ సెక్రటరీగా కె రమేష్ కుమార్ ఎన్నికైన సందర్భంగా బుధవారం  ఏలూరు జిల్లా కలెక్టర్ . వై ప్రసన్న వెంకటేష్ I ఐ ఏ ఎస్  ని, జిల్లా జాయింట్ కలెక్టర్  బి. లావణ్య వేణి ఐఏఎస్ ని మరియు జిల్లా రెవిన్యూ అధికారి  డి. పుష్ప మణి వారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మరియు జిల్లా జాయింట్ కలక్టర్  మరియు జిల్లా రెవిన్యూ అధికారి వారు ఉద్యోగులు విధి నిర్వహణలోసమర్థవంతంగా పనిచేసి, సంఘ సభ్యులకు అండగా నిలవాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA) రాష్ట్రా జనరల్ సెక్రటరీగా ఎన్నికైన  కె. రమేష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేసారు.

About Author