PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మణికంఠ కుటుంబానికి ఏపీడబ్ల్యజెఎఫ్ సంఘ సభ్యులు ఆర్థిక సాయం..

1 min read

పిన్నవయసులో తోటి జర్నలిస్టును కోల్పోవడం బాధాకరం

సంతాపం వ్యక్తం చేసిన పలువురు జర్నలిస్ట్ సంఘ నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రభ రిపోర్టర్ మణికంఠ కుటుంబ సభ్యులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆర్థిక సాయంకార్యం రోజున సాయం మొత్తాన్ని ఆయన తండ్రికి అందజేసిన జిల్లా కమిటీ సభ్యులువెంకట్రావు, రిపోర్టర్ సాగర్ఏలూరు,ఇటీవల గుండెపోటుతో మరణించిన ఆంధ్రప్రభ రిపోర్టర్ శ్రవణం మణికంఠ కుటుంబ సభ్యులకు ఆదివారం ఆయన కార్యం రోజున రాష్ట్ర ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘ సభ్యులకు ఆదేశాలనుసారం జిల్లా కమిటీ తరుపున జిల్లా అధ్యక్షులు జబీర్ సూచనల  మేరకు జిల్లా కమిటీ సభ్యుల ఆమోదంతో  తోట వెంకట్రావు, రిపోర్టర్ యర్రా సాగర్ లు చాటపర్రులోమణికంఠ తండ్రి శ్రీనివాస్ కు కొంత పెద్ద మొత్తాన్ని ఆర్థిక సహాయం క్రింద అందజేశారు. జర్నలిస్ట్ లకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా  ఏపీడబ్ల్యూజేఎఫ్ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షులు సయ్యద్ జబీవుల్లా(జబీర్) మరియు సంఘ సభ్యులు     తెలిపారు. సహాయమందించిన జర్నలిస్ట్స్ సోదరులకు. పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పలువురు జర్నలిస్ట్ సంఘ నాయకులు ఆర్థిక సహాయని అందజేసి, తమ ప్రగాఢ సంతాపాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రతి జర్నలిస్టు వృత్తిరీత్యా ఎంత ఒత్తిడి ఉన్న ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలని, కుటుంబ సభ్యులు మనపై ఆధారపడి ఉన్నారన్న అవగాహన కలిగి ఉండాలని తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పిన్న వయసులో తోటి జర్నలిస్టు మణికంఠ ను కోల్పోవడం బాధాకరమని పలువురు జర్నలిస్టులు విచారణ వ్యక్తం చేశారు.

About Author