NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ ఓటీఎస్​’ పై తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్డీవో…

1 min read

పల్లెవెలుగువెబ్​, గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్ల లోని తహసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ లతో  గురువారం ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి,మండల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేప్పట్టిన జగనన్న గృహ హక్కు సర్వే పై మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అవగాహన కల్గించి ప్రతి ఒక్కరూ వన్ టైమ్ సెటిల్ మెంట్ పై స్వచ్చంద గృహ హక్కు సర్వే కు  ముందుకు వచ్చేలా ప్రేరేపించాలన్నారు. ఈ కార్యక్రమంపై ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులు వీఆర్వోలు సర్వేలు గ్రామ వాలంటీర్లు సమిష్టి కృషితో  మండలంలో మంచి రిజల్ట్ సాధించాలని అన్నారు.

About Author