PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎంకు బుర్ర త‌క్కువ అన్న వారి పై కేసులుండ‌వా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి జగన్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. ‘‘జగన్ రెడ్డి గారు.. మీ పాలనా వైఫల్యాలపై సోషల్ మీడియాలో చిన్న విమర్శ చేస్తేనే టీడీపీ కార్యకర్తలపై దేశద్రోహం కేసులు బనాయించి వేధిస్తున్నారు.. సకల శాఖా మంత్రి సజ్జల, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మిమ్మల్ని అవగాహనలేని ముఖ్యమంత్రి, బుర్ర తక్కువ హామీలు ఇచ్చారని పబ్లిగ్గా మీ పరువు తీస్తున్నారు. మరి వాళ్లపై కేసులు ఉండవా ముఖ్యమంత్రి గారూ..’’ అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు.

                                                 

About Author