PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరోగ్యశ్రీ @ రూ.25 లక్షలు

1 min read

మంత్రాలయం, పల్లెవెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ 25 లక్షల వరకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో  నూతనంగా వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులను లబ్దిదారులకు అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ 25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా వైద్య సేవలు పొందవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో కాచాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సురేష్, తహసీల్దార్ చంద్ర శేఖర్, మండల ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య తదితరులు ఉన్నారు.

About Author