PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుంభాభిషేకానికి హోమగుండాల ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ఈనెల మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహాకుంభాభిషేక మహోత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహిస్తుందిమహా కుంభాభిషేకానికి పురస్కరించుకుని ఆలయప్రాంగణములో యాగశాలల ఏర్పాట్లు. అధికారులు పరిశీలిస్తున్నారు.యాగశాలల ఏర్పాట్లకుగాను సంప్రదాయ బద్ధంగా పూజాదికాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సహస్రదీపాలంకరణ మండపం ఎడమవైపునప్రాచీనాలయాలను పునరుద్ధరించడం జరిగింది. ఈ ప్రాచీన ఆలయాలలో మహాకుంభాభిషేక సమయంలోనే శివలింగ ప్రతిష్ఠలు నిర్వహిస్తున్నారు యాగశాల నిర్మాణ సంబంధి పూజాదికాల అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న మూడు శివాలయాలకు మరియు ఆలయ హరిహరరాయగోపురానికి ఏర్పాటు చేస్తున్న పరంజా పనులను పరిశీలించారు. అన్నీ గోపురాలకు కూడా పరంజాలు దృఢంగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న ఈ ఈ రామకృష్ణ ఆలయ సిబ్బంది మరియు అర్చకులు పాల్గొన్నారు.

About Author