PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమంగా విక్రయిస్తున మద్యం పట్టివేత….

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  మండల పరిధిలోని మాధవరం తండా గ్రామంలో అక్రమంగా, ఏలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆంధ్ర, కర్ణాటక కు చెందిన పట్టుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మాధవరం ఎస్సై కిరణ్ బాబు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కింగ్ ఫిషర్ 29 బాటిల్లు, మాన్షన్ హౌజ్ 17 బాటిల్లు, ఒరిజినల్ ఛాయిస్ 6 టెట్రా పాకెట్స్ వీటి తో పాటు 05 లిటర్స్ నాటు సారా ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా దుకాణాలలో విక్రయిస్తున్న సుగాలి సూర్య నాయక్, సుగాలీ హనుమంతు నాయక్, సుగాలి శివాజీ నాయక్ లను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు. అలాగే అడవుల్లో ఉన్న నాటు సారా బట్టిలను ధ్వంసం చేసి సుమారు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు ఎస్ఐ కిరణ్ తెలిపారు.  ఈ దాడుల్లో  ఏఎస్సై బందే నవాబ్, కానిస్టేబుళ్లు సోమ శేఖర్, వీరాంజి, వీరాంజనేయులు  పాల్గొన్నారు.

About Author