PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేకాటరాయుళ్ళు అరెస్ట్ .. 76 వేల నగదు స్వాధీనం

1 min read

– 10 సెల్‌ పోన్లు, 4 మోటర్‌ సైకిళ్ళు సీజ్‌
పల్లెవెలుగువెబ్​, చాగలమర్రి : మండలంలోని పెద్దబోధనం నుండి తోడేండ్లపల్లెకు వెళ్ళే రహదారిలో పేకాట స్థావరం పై ఎస్​ఐ మారుతి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం దాడి చేశారు. దాడిలో ఆళ్ళగడ్డ, రుద్రవరం మండలాలకు చెందిన వెంకటసుబ్బయ్య, శేఖర్‌, ప్రవీణ్‌, గంగరాజు, బేగం బాష, మనోహర్‌, మదన్‌, జయరాముడుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ 76,400 ల నగదు, 10 సెల్‌ పోన్లు, 4 మోటర్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మరి కొందరు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని ఎస్​ఐ మారుతి పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Author