NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏవోబీలో ఆరుగురు మావోయిస్టుల అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రా-ఒరిస్సా స‌రిహ‌ద్దులో ఆరుగురు మావోయిస్టుల‌ను విశాఖ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అగ్రనేత ఆర్కే గ‌న్ మెన్లు ఉన్నట్టు స‌మాచారం. అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమును చంపిన వారు కూడ అరెస్టయిన వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టుల అరెస్టు పై డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించ‌నున్నారు. ఇటీవ‌ల పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య భీక‌ర ఎన్ కౌంట‌ర్ త‌ర్వాత ఆరుగురు మావోయిస్టులు అరెస్టు కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

About Author