PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అన్యాయం

1 min read

.. టిడిపి నేతలు

 కలెక్టరేట్ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపిన నేతలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ ఆధ్వర్యంలో టిడిపి నేతలు నిరసన కార్యక్రమం చేశారు. నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చెవిలో పూలు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబుకు న్యాయం జరగాలని నినాదాలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన్ను అన్యాయంగా అరెస్టు చేసి జైలులో పెట్టారని వారు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏనాడు అవినీతి చేయలేదన్నారు. ఆయనపై పెట్టిన కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబువైపే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు నాగరాజు యాదవ్, అబ్బాస్, ముంతాజ్ బేగం, గున్నామార్క్, పరమేశ్వర రెడ్డి, వినోద్ చౌదరి, తిమ్మోజీ, రామాంజనేయులు, నంది మధు, నరసింహులు, రాజశేఖర్ యాదవ్, మోహన్, పాల్ రాజ్, ఏసు, రాజశేఖర్ రెడ్డి, ప్రకాష్, రామక్రిష్ణబాబు, రఫి, తదితరులు పాల్గొన్నారు.

About Author