PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అడుగడుగునా ఆర్థర్ కు జన నీరాజనాలు..

1 min read

వాడవాడలా అపూర్వ స్వాగతం..

సంగమేశ్వరంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆర్థర్..

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా  ప్రజలు ఆశీర్వదించి ఓటు వేయండి..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తొగురు ఆర్థర్ కొత్తపల్లి మండలం సంగమేశ్వరం క్షేత్రం లో  శనివారం  ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఉదయం 8.45 ని.సంగమక్షేత్రం లో పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామ పంచాయతీ పరిధిలోని జానాల గూడెం, బలపాల తిప్ప , పాత సిద్దేశ్వరం, ఎర్రమఠం, మాడుగుల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్థర్ ఎన్నికల ప్రచారంలో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

About Author