PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్​డీఓ

1 min read

పల్లె వెలుగు వెబ్​:మహానంది మండలం మహానది గ్రామపంచాయతీ సచివాలయాన్ని నంద్యాల ఆర్​డీఓ చాహత్ వాజ్పేయ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులను పెండింగులో ఉండరాదని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.అధికారులు కానీ సిబ్బంది గాని అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు . తాగునీరు, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు . సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు . కాలువలు మరియు మురికి కుంటల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ బ్లీచింగ్ చేయాలన్నారు. అనంతరం రికార్డును తనిఖీ చేశారు. సిబ్బంది మరియు వాలంటీర్ల లో మార్పు రాకపోతే చర్యలు తప్పవన్నారు .ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జనార్ధన్ శెట్టి, డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి ,ఆర్ఐ నాగేంద్ర, విఆర్వో శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

      

About Author