NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వేడుకగా బాలరాముడి ప్రతిష్ఠా కార్యక్రమం 

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మండల పరిధిలోని బూజునూరులో గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక రామాలయంలో సరిగ్గా అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠ ముహూర్త సమయంలో పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అనంతరం తెదేపా మండల నాయకుడు పంట రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులందరికీ అన్నదానం చేశారు. సాయంత్రం సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరాముని పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా పాల్గొని జైశ్రీరామ్ నినాదాలు చేశారు.

About Author