PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి చేస్తున్నామంటూ… మోసం

1 min read

– వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి.
పల్లెవెలుగు, వెబ్​ పాణ్యం: మండలంలోని పిన్నాపురం గ్రామం లో బాదుడే బాదుడు కార్యక్రమం లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి గౌరూ చరిత రెడ్డి గ్రామం లో ఇంటింటికీ తిరిగి వ్యతిరేక విధానాలపై కరపత్రాల రూపంలో ప్రజలకు అందజేశారు పాణ్యo నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి గారు ఈ సందర్భంగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ. గ్రామం లో ముఖ్యంగా వీధి లైట్లు మరియు రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేక ఇంటి ముందు డ్రైనేజీ మురికి నీళ్లతో ఇబ్బంది పడుతున్నారని గ్రీన్ కో సోలార్ కంపెనీ గత కొన్ని సంవత్సరాల నుండి చుట్టుపక్కల పనిచేస్తున్న గ్రామస్తుల భూములు కావాలి కానీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని మౌలిక వసతుల కల్పన ఎక్కడ అని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం లో ఈ నియోజకవర్గం లో మరియు ఈ గ్రామం లో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు,గత టీడీపీ ప్రభుత్వం లో అభివృద్ధి పనులతో పాటు సంక్ష్మేమ పథకాలు ప్రజలందరికీ అందజేసిన ఘనత గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిందని రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడును బలపరిచేందుకు ముందుకొస్తున్న ప్రతి ఒక్కరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామన్నారు.2019 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్ రెడ్డికి మద్దతు పలికారని ..చంద్రబాబు నాయుడు కంటే ఆయన ఎక్కువ మేలు చేస్తారని ఆశించారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు దగ్గర పడుతున్న కనీసం రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులు చేయలేదన్నారు గతంలో జగన్ రెడ్డి వైపు మొగ్గుచూపిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని టిడిపి పార్టీని మద్దతు తెలుపాలన్నారు ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైసిపికి తగిన బుద్ధి చెబుతారని నవరత్నాలు, బటన్ నొక్కడాలు తప్ప గతంలో అమలులో ఉన్న అనేక సంక్షేమ పథకాలకు జగన్ రెడ్డి చరమగీతం పాడేశారని ఎద్దేవా చేశారు షాది ముబారక్ అంటూ ముస్లిం మైనార్టీలను మోసం చేస్తున్నారని కులానికి ఒక కార్పొరేషన్ అంటూ డైరెక్టర్లను నియమించి కనీసం బడ్జెట్ కేటాయించకుండా ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు పండగ, పెళ్లి కానుకలు, బీమాలు, వివిధ కార్పొరేషన్ల రుణాలు వంటివి ఎన్నో పథకాలే గాక కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా లేకుండా చేశారనిరైతులకు కోసం గతంలో అమలైన ఎన్నో పథకాలు ఈ రోజు కనిపించడం లేదు మైనింగ్ పేరుతో పచ్చని ప్రకృతిని పెద్దలు గద్దలు రాబందుల్లా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు జయరామి రెడ్డి,గ్రామస్థులు వెంకటరమణ,జి వెంకట రమణ,విజయ్,తిరుమల నాయుడు,కందికాయ పల్లె వెంకట రమణ,మండల నాయకులు రమణ మూర్తి,సునీల్ రెడ్డి,రాంపుల్ల రెడ్డి,సుబ్బారెడ్డి,శివ శంకర్ రెడ్డి,ఎంపీటీసీ రంగ రమేష్,మాజీ ఎంపీటీసీలు సుభాన్,మాజీ ఎంపీపీ నారాయణమ్మ,ఆలమూరు చంద్ర శేఖర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,అమరసింహ రెడ్డి,కందికాయపల్లే ఈశ్వర్,గొరుకల్లు సురేష్,వెంకటేష్,రవి కుమార్ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author