PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ సీఎంగా ఉన్నంత వ‌ర‌కు న‌న్నెవ‌రూ..ఏమీ చేయలేరు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వ‌ర‌కూ న‌న్నెవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని మంత్రి గుమ్మనూరు జ‌య‌రాం వ్యాఖ్యానించారు. దాదాగిరి చేయ‌డానికి తాను అంత‌ర్రాష్ట్ర స్మగ్లర్ వీర‌ప్పన్ కాద‌ని అన్నారు. త‌న నియెజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఆస్పరిలో ఖాళీ ఇసుక ట్రాక్టర్లు ప‌ట్టుకుంటే వ‌దిలేయ‌మ‌ని చెప్పాన‌ని అన్నారు. పోలీసుల‌తో దౌర్జన్యంగా మాట్లాడి ఉంటే త‌నది త‌ప్పని, తాను దౌర్జన్యంగా మాట్లాడిన‌ట్టు ఉందా ? అని ప్రశ్నించారు. ఖాళీ ట్రాక్టర్లు మాత్రమే వ‌దిలేయ‌మ‌ని చెప్పాన‌ని అన్నారు. నాపై బుర‌ద‌జ‌ల్లే కార్యక్రమం పెట్టుకోవ‌ద్దని అన్నారు. సీఎంని కలిసి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్యలు మాత్రమే చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం క‌ర్ణాట‌క స‌రిహద్దులో ఉంటుంద‌ని, మ‌ద్యం ఏరులై పారుతుంటే తానేం చేయ‌గ‌ల‌న‌ని అన్నారు. అదే ప‌నిగా కాచుకుని కూర్చుంటానా ? అని వ్యాఖ్యానించారు.

About Author