PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్విస్ బ్యాంకులో మ‌న వాళ్ల సంప‌ద పెరిగింద‌ట !

1 min read

పల్లెవెలుగు వెబ్: స్విస్ బ్యాంకుల్లో భార‌తీయుల సంప‌ద భారీగా పెరిగింది. ఈ మేర‌కు ఆ దేశ జాతీయ బ్యాంకు ఎస్ఎన్ బి ఓ ప్రక‌ట‌న చేసింది. 20 వేల 700 కోట్లు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నట్టు ప్రక‌టించింది. 2019లో 6వేల 625 కోట్లు ఉన్న భారతీయుల సంప‌ద అమాంతం పెరిగిన‌ట్టు ఎస్ఎన్ బి తెలిపింది. 2011 తర్వాత ఈ స్థాయిలో పెర‌గ‌డం ఇదే మొద‌టి సారి అని చెప్పింది. 2006లో 6.5 బిలియ‌న్ స్విస్ ప్రాన్సులుగా ఉన్నట్టు ఎస్ఎన్ బి తెలిపింది. 2014 ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధ‌నాన్ని వెన‌క్కి తెప్పిస్తామ‌ని, ఒక్కో భార‌తీయుడి అకౌంట్ లో 15 ల‌క్షల డ‌బ్బు వేస్తామ‌ని ప్రధాని న‌రేంద్ర మోదీ ఎన్నికల హామీగా ప్రక‌టించడం గ‌మ‌నార్హం.

About Author