PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసదుద్దీన్ ఓవైసీ కారు పై కాల్పులు !

1 min read

పల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కారు పై యూపీలో కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రయాణంలో ఉన్న ఓవైసీ కాన్వాయ్‌పై ఛిజారసీ టోల్ గేట్ సమీపంలో కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్వయంగా ఓవైసీనే వెల్లడించారు. తన కారు పంక్చర్ అయిందని, తాను వేరే కారులో వెళ్లానని తెలిపారు. అయితే దాడికి పాల్పడ్డ వారు ఎవరనేది తెలియలేదు. ఓవైసీ సైతం ఎవరిపై అనుమానాలు ఉన్నట్లు వెల్లడించలేదు. తాను క్షేమంగా ఉన్నట్టు అసదుద్దీన్ తెలిపారు.

         

About Author