PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసదుద్దీన్ పై కాల్పుల ఘటన.. నిందితులు ఏం చెప్పారంటే ?

1 min read

పల్లెవెలుగువెబ్ : హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీని ఇంతకుముందు మూడు ర్యాలీల్లో చంపాలని ప్రయత్నించామని, జనం ఎక్కువగా ఉండడం వల్ల వెనక్కి తగ్గామని ఆయన కారుపై కాల్పులు జరిపిన నిందితులు సచిన్‌ శర్మ, శుభం పోలీసులకు తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందువల్లే ఒవైసీపై తాము కాల్పులు జరిపామని శనివారం పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకొన్నారు. కాగా తన వాహనంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసును న్యాయంగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఎంపీ అసదుద్దీన్‌ విజ్ఞప్తి చేశారు.

    

About Author