PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అశోక్ బాబుకు బెయిల్ మంజూరు

1 min read

పల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్ మంజూరు అయింది. రూ. 20 వేల పూచికత్తుతో సీఐడీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ సర్వీసులో ఉండగా పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై అశోక్ బాబును సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. దాదాపు 17 గంటల పాటు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో ఉంచి విచారించారు. అనంతరం కోవిడ్ నెగిటివ్ రావడంతో ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి అశోక్ బాబుకు బెయిల్ మంజూరు చేశారు.

         

About Author