PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐకి గాయాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పని చేస్తున్న సుబ్బయ్యకు,మరో వ్యక్తికి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని మిడుతూరు గ్రామానికి చెందిన జంగాల సుబ్బరాయుడు ఆవుల పంచాయితీ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కంప్లైంట్ నిమిత్తం బుధవారం సాయంత్రం ఏఎస్ఐ సుబ్బయ్య మరియు జంగాల సుబ్బరాయుడు ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై అలగనూరుకు వెళ్తుండగా రోళ్ల పాడు,అలగనూరు మధ్యలో అలగనూరు నుండి కాటేపోగు. సంజన్న అనే వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ పై వస్తూ ఉండగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఎస్ఐ సుబ్బయ్యకు కాలుకు రక్తస్రావమై కాలుకు గాయమైనది.జంగాల సుబ్బరాయుడుకు కాలు విరిగినది.మిడుతూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కొరకు 108 అంబులెన్సులో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About Author