NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘము ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతిరావు పూలే 197 వ జయంతి సందర్బ గురువారం  స్థానిక బి .సి .భవన్ నందు కర్నూలు  జిల్లా కురువ సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,జిల్లా నాయకులు పెద్దపాడు ధనుంజయ ,కోశాధికారి కే .సి .నాగన్న ,నగర కురువ సంఘము అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ ,కే .బీచుపల్లి ,కే .హరిదాసు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది .ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి మాట్లాడుతూ సామజిక తత్వవేత్తగా ,ఉద్యమకారుడిగా పూలే భారతదేశంలో కుల వివక్షతకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం మరియు పేద అణగారిన ప్రజలకోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడి ఆశయాలను కొనసాగించాలని తెలిపారు .ఈ కార్యక్రమం లో జిల్లా  సహాయ కార్యదర్శి కొత్తపల్లి దేవేంద్ర పాల్గొన్నారు .

About Author