PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచలింగాల చెక్​ పోస్టు వద్ద…96 బాటిళ్లు పట్టివేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూల్ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద సోమవారం SEB సిఐ మంజుల ఆధ్వర్యంలో యస్ ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ , సిబ్బంది వాహనాలు తనిఖీ చేశారు. కోవెలకుంట్ల మండలం లింగాల గ్రామానికి చెందిన B వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి రాయచూరు నుండి కర్నూల్ కు వస్తున్న KSRTC బస్సు నందు బ్యాగులో 96 బాటిళ్లు తెలంగాణమద్యం తెస్తూ పట్టుబడ్డాడు. సదరు వ్యక్తిని , మద్యాన్ని కర్నూల్ SEB పోలీసు స్టేషన్ కు తదుపరి విచారణ నిమిత్తం పంపినట్లు సెబ్​ సీఐ మంజుల తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ గోపాల్ గౌడు, ఖాజా,రాజశేఖర్ కానిస్టేబుళ్లు అన్సార్,మధు,శ్రీనివాసులు SPO లు రంగస్వామి,పరుషరాం,తిరుపాల్ రెడ్డి పాల్గొన్నారు.

About Author