PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇప్ప‌టం గ్రామ‌పంచాయ‌తీకి రూ. 50 ల‌క్ష‌లు ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జ‌న‌సేన ఆవిర్భావ స‌భ మొద‌లైంది. జై ఆంధ్ర, జై తెలంగాణ, జై భారత్ అని ప‌వ‌న్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆరంభంలోనే సర్వమతాలను జనసేనాని ప్రస్తావించారు. సభ నిర్వహించేందుకు అనుమతిచ్చిన ఇప్పటం రైతులకు పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామపంచాయతీకి రూ.50 లక్షలు ఆయన ప్రకటించారు. జనసైనికులు కొదమ సింహాలై గర్జించాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలకు అండగా ఉండాలనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విభేదాలుండొచ్చు..వ్యక్తిగత ధ్వేషాలొద్దని పవన్‌ సూచించారు.

                                             

About Author