PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇయ‌ర్ ఎండ్ లో.. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. డిసెంబ‌ర్ డెరివేటివ్స్ ముగిసిన నేప‌థ్యంలో సూచీలు ఉద‌యం నుంచి తీవ్ర ఊగిస‌లాట‌కు గురయ్యాయి. ఉద‌యం న‌ష్టాల్లో ప్రారంభ‌మై.. అనంత‌రం లాభాల్లోకి చేరాయి. అనంత‌రం ఫ్లాట్ గా ముగిశాయి. అంత‌ర్జాతీయంగా సూచీలు మిశ్ర‌మంగా క‌దిలాయి. ఐటీ, ఫార్మా షేర్లు మిన‌హా అన్ని రంగాల షేర్లు న‌ష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 12 పాయింట్ల స్వ‌ల్ప న‌ష్టంతో 57794 వ‌ద్ద‌, నిఫ్టీ 9 పాయింట్ల స్వ‌ల్ప న‌ష్టంతో 17204 వ‌ద్ద ముగిశాయి.

                                    

About Author