NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలెక్టర్ చేతుల మీదుగా దత్తత పాపను అజ్జిదారుల చెంతకు

1 min read

– సంతోషం వ్యక్తం చేసిన దత్తత తీసుకున్న తల్లిదండ్రులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : భవాని శైలజ అను 11  సo.  వయస్సు గల పాపను కర్ణాటక   రాష్ట్రం నకు  చెందిన దత్తత అర్జీదారులైన ఆనంద్ కిరణ్  మరియు బ్లేస్సి దంపతులకు   శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా దత్తత అధికారి  వె.ప్రసన్న వెంకటేష్  ద్వారా భవాని శైలజను దత్తత ఇవ్వడమైనది. దత్తత అర్జీ దారులు 2023  సం. లో దత్తత  కొరకు దరఖాస్తు చేసుకున్నారు.ఆనంద్ కిరణ్ మరియు బ్లేస్సి  దంపతులు  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారాతధికారి, కె. పద్మావతి, డి.సి.పి.ఓ. సిహెచ్. సూర్య చక్ర వేణి, బాలల రక్షణాధికారి ఆర్. రాజేష్, ఈ.ఓ మల్లికా పాల్గున్నారు.

About Author