PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విఘ్నేశ్వరుడి వద్ద… అన్నదానం.

1 min read

పల్లెవెలుగు వెబ్​:కడప జిల్లా చెన్నూరు మండల వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన వినాయక మండపాల దగ్గర గురువారం రెండో రోజు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులు వినాయకుని మంటపాలు సందర్శించిపూజలు నిర్వహించారు. చెన్నూరు మండలం రామనపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం దగ్గర శ్రీ గణపతి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు, శ్రీ చౌడేశ్వరి దేవస్థానం నందు గణేష్ మండపం నందు అన్నదానం బీసీ కాలనీలోని అన్నదాన కార్యక్రమ ప్రాంతాల్లో వినాయకుని మంటపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి మా సీమ బాబు, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రమణ శ్రీలక్ష్మి, రామన పల్లి గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నూరు శివాలయం వీధి లో వెలసిన వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కమలాపురం శాసనసభ్యుడుపి. రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు పి నరెన్ రెడ్డి. చెన్నూరు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నూరు బెస్త కాలనీ లక్ష్మీ నగర్ ప్రాంతాల్లో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురు ప్రజా ప్రతినిధులు పూజల పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నూరు లో పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ఊరేగింపు నిర్వహిస్తూ విగ్రహాలను చెన్నూరు హైవే వంతెనపై నుంచి పెన్నా నది లోకి నిమజ్జనం చేశారు.

About Author