PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడా కారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:   క్రీడా కారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని టీటీడీ పాలకమండలి సభ్యులు  వై. సీతారామిరెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి  ఆదేశాల మేరకు బొంబాయి శివ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించారు. వీరి కి పూల వర్షం కురిపిస్తు ఘనంగా స్వాగతం పలికారు. బొంబాయి శివ  పలువురికి పూలమాలలు వేసి శాలువ కప్పి సన్మానించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి క్రికెట్ పోటీలు ప్రారంభించి బ్యాటింగ్ చేయగా జి.భీంరెడ్డి బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సహ పరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, పెట్రోల్ బంకు శ్రీను, రిటైర్డ్ తహసీల్దార్ వర్మ సార్, సీఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ ఆనంద్ రెడ్డి, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, వార్డు సభ్యులు వీరారెడ్డి, క్రీడాకారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

About Author