PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నీట్‌లో ప్రతిభచూపిన ఆత్మకూరు వాసి.. ఆలిండియా 6916 ర్యాంక్‌

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ (నీట్‌) 2023 ఫలితాలు విడుదలయ్యాయి.నీట్‌ పలితాలలో ఆత్మకూరు కు చెందిన జావీద్ హుస్సేన్ 6916 ఆలిండియా ర్యాంకు సాధించాడు. ఆత్మకూరు పట్టణానికి చెందిన సలీం, ఫతిమున్నిసా దంపతుల కుమారుడైన జావీద్ హుస్సేన్ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ వైద్య విద్యను పూర్తి చేశాడు. అనంతరం నీట్ పిజి ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆలిండియా 6916 వ ర్యాంకు సాధించాడు.ఈమేరకు తల్లిదండ్రులు తమ కుమారుడికి ఈ ర్యాంకు రావడం సంతోషాన్నిచ్చిందన్నారు.తల్లిదండ్రుల ప్రోత్సాహం, లెక్చరర్ల సహకారంతోనే నాకు మంచి ర్యాంకు వచ్చిందని జావేద్ హుస్సేన్ తెలిపారు.

About Author