PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మసాక్షి స‌ర్వే.. గెలుపు ఎవ‌రిదంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ పార్టీనే అధిక సీట్లు సాధించనుందని ‘ఆత్మసాక్షి’ గ్రూప్‌ తెలంగాణవ్యాప్తంగా జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు, ఓట్లు తగ్గినా మొత్తానికి విజయం మాత్రం ఆ పార్టీదేనని.. టీఆర్‌ఎ్‌స-కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని తేలింది. ఆ సర్వే ప్రకారం.. టీఆర్‌ఎ్‌సకు 39.5% ఓట్లతో 56 నుంచి 59 స్థానాలు రానున్నాయి. కాంగ్రె్‌సకు 31.5% ఓట్లతో 37 నుంచి 39 దాకా స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 21% ఓట్లు.. 14 నుంచి 16 దాకా సీట్లు వస్తాయని వెల్లడైంది. పలు జిల్లాల్లో టీఆర్‌ఎ్‌స-కాంగ్రె్‌సల మధ్యనే పోటీ ఉంటుందని.. కొన్ని జిల్లాల్లో మాత్రం మూడుపార్టీల మధ్య పోరు ఉంటుందని తేలింది. అలాగే.. మజ్లిస్‌ పార్టీకి 2.75 శాతం ఓట్లు, ఇతరులకు 3.25శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది.

                                       

About Author