PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం జగన్​పై దాడి..హేయమైన చర్య..

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విజయవాడలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్​.  సీఎం జగన్​ చేస్తున్న బస్సు యాత్ర, సిద్ధం సభకు ప్రజల నుంచి విశేష ఆదరణ చూసి ఓర్వలేకనే… ప్రతిపక్షాలు ఇలా రాళ్లతో దాడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు తక్షణమే విచారణ వేగవంతం చేసి దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని శనివారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్​ కోరారు.

About Author