PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కానిస్టేబుల్ పై దాడి

1 min read

పల్లెవెలుగు వెబ్: సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరులో కానిస్టేబుల్ మీద న‌లుగురు వ్యక్తులు దాడి చేశారు. నోవాపాన్ కూడ‌లిలో బాచుప‌ల్లి స్టేష‌న్ కానిస్టేబుల్ క‌న‌క‌య్య మీద దాడి చేశారు. బాచుప‌ల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ మారుతీ ప్రసాద్.. కొత్తగా నిర్మించుకున్న ఇంటిలో ఇంటీరియ‌ర్ వ‌ర్క్ కోసం దేవీలాల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 5 ల‌క్షల‌కు డీల్ కుదుర్చుకోగా.. కొంత మొత్తం దేవీలాల్ కు మారుతీ ప్రసాద్ అడ్వాన్స్ గా ఇచ్చాడు. అడ్వాన్స్ తీసుకున్న దేవీలాల్ ప‌నిచేయ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్నాడు. మారుతీ ప్రసాద్ కోర్టు ద్వార దేవీలాల్ మీద కేసుపెట్టాడు. దేవీలాల్ ఉన్న ప్రాంతానికి కానిస్టేబుల్ క‌న‌క‌య్యతో క‌లిసి వ‌చ్చాడు. దేవీలాల్ ను నోటీసు తీసుకుని సంత‌కం చేయ‌మ‌ని కోర‌గా.. పోలీస్ కానిస్టేబుల్ క‌న‌క‌య్య మీద త‌న స్నేహితుల‌తో క‌ల‌సి దాడి చేశాడు. పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పినా వినిపించుకోకుండా దాడి చేశారు. దేవీలాల్ ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

About Author