PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కానిస్టేబుల్ పై దాడి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ వ్య‌క్తి కానిస్టేబుల్ పై దాడికి దిగాడు. టూ టౌన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కుమార్‌పై సంతోష్‌ అనే వ్యక్తి దాడి చేశాడు. ట్రాఫిక్‌లో అతి వేగంగా వెళ్తున్న కారును కానిస్టేబుల్‌ కుమార్‌ అడ్డుకున్నాడు. సంతోష్‌ అనే వ్యక్తి కారుదిగి నా కారునే ఆపుతావా అంటూ కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. దీంతో టూటౌన్‌ పోలీసులు సంతోష్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

                                           

About Author