NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేకాట శిబిరం పై దాడి.. ఎనిమిది మందిపై కేసు నమోదు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: ఓర్వకల్లు మండలం, ఉయ్యలవాడ గ్రామ శివారులోని కంప చెట్లల్లో శనివారం నాడు ఉయ్యలవాడ గ్రామానికి చెందిన 8 మంది పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసి వారి వద్ద నుండి Rs.5900/- రూపాయల నగదు, 8 సెల్ ఫోన్లు, 52 పేక ముక్కలు స్వాధీనము చేసుకొని వారిని అరెస్టు చేసినట్టు ఓర్వకల్ ఎస్సై మల్లికార్జున తెలిపారు. ఎవరైనా మండలంలో పేకాట, మట్కా, కోడి పందెలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ పేకాట రైడ్ లో ఎస్ఐ తో పాటు ఓర్వకల్ పోలీసులు వీరా రెడ్డి, విజయ్ భాస్కర్, ఖాసీం,లక్ష్మణ్, శ్రీను పాల్గొన్నారు.

About Author