PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ నేత పై దాడి.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లా తాడికొండలో టీడీపీ నేత పై దాడి జ‌రిగింది. అక్రమ మైనింగ్‌పై టీడీపీ మైనారిటీ నేతలు కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన షేక్ సుభానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన సుభాని అపస్మాకరస్థితిలోకి వెళ్లడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని టీడీపీ నేతలు పరామర్శించారు. అండగా ఉంటామని సుభాని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైసీపీ నేతల దుర్మార్గాలకు త్వరలోనే సమాధానం చెబుతామని టీడీపీ నేతలు అన్నారు.

                                      

About Author