NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై దాడి చేయడం హేయమైన చర్య

1 min read

ముకుమ్మడిగా ఖండించినజర్నలిస్టు సంఘాలు

ఏపీడబ్ల్యూజె ఆధ్వర్యంలో తాహసిల్దార్,ఎస్ఐలకు వినతి పత్రాలు ఇచ్చిన కమలాపురం జర్నలిస్టులు

పల్లెవెలుగు వెబ్ కమలాపురం :  రాప్తాడులో సిద్ధం సమావేశం లో ఫోటోలు తీస్తుండగా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కృష్ణ పై దాడి, పత్తికొండలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్, కర్నూల్ లో ఈనాడు కార్యాలయం పై వైకాపా అల్లరిమూకలు దాడి చేయడం దుర్మార్గమైన చర్యని రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల్లో భాగంగా కమలాపురంలో తాహసిల్దార్ కు, ఎస్ఐ లకు కమలాపురం విలేకరులు వినతి పత్రాలు అందించారు. జర్నలిస్టుపై దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కమలాపురం విలేకరులు పాల్గొన్నారు.

About Author