PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టులపై దాడికి పాల్పడడం హేయమైన చర్య

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈనాడు కార్యాలయం పై అలాగే  ఆంధ్రజ్యోతి విలేకరులపై నిరసనగా బుధవారం తాసిల్దార్  ఎం ప్రసాద్ రాజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే గౌరవాధ్యక్షుడు అమీర్ సాబ్ మాట్లాడుతూ పత్రిక రంగంపై జర్నలిస్టులపై ఫోటోగ్రాఫర్లపై వైకాపా నాయకులు దాడి చేయడం చాలా దుర్మార్గమని ఇటువంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం స్పందించి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది , జర్నలిస్టులో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటారని అటువంటి వారిపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు అందుకు నిరసన చేపట్టడం జరిగింది, ఇటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మద్దతుగా బిజెపి మండల అధ్యక్షుడు ఏం. ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు మంగయ్య, సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు,   ఏపీయూడబ్ల్యూజే మండల నాయకులు నాగరాజు, మహేష్ గౌడ్, ఎం ముదస్సిర్, మంజునాథ్ , ఎం. హారున్ భాష,  సంజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

About Author