PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళితులపై దాడులు దారుణం..!

1 min read

– టీడీపీ శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, మహానంది: దళితులు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. అని ప్రశ్నించారు టిడిపి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. మహానంది మండలం గాజులపల్లె ఆర్ఎస్ గ్రామంలో సోమవారం దళిత కాలనీలో సిసి రోడ్డు ను సక్రమంగా ఒక చోటు నుండి ప్రారంభించక పోవడంపై ప్రశ్నించడంతో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ తన అనుచరులతో దళితులపై దాడులు చేయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే దళిత కాలనీలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. దళితుల పై దాడికి పాల్పడిన వ్యక్తులను రెండు రోజుల లోపల అరెస్టు చేయాలని, బాధిత కుటుంబాలకు పోలీసుల రక్షణ కల్పించాలని నంద్యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డిని మీ ఫోన్ ద్వారా కోరారు. కేసు విత్​ డ్రా చేసుకోవాలని ముద్దాయిల నుంచి బాధితులకు బెదిరింపులు అధికమయ్యాయని, ఇక్కడ న్యాయం జరగకపోతే ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

About Author