NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మైనారిటీలపై దాడులు.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి

1 min read

– ఆత్మకూరు మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఖండన
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: చిత్తూరు జిల్లా వీ.కోట. లో స్థల వివాదంపై ముస్లిం మైనార్టీ అయిన వృద్ధ వ్యక్తిపై దాడి చేయడం అమానుషం, దీనిపై ఖండించిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారుక్ శుబ్లిపై కేసు నమోదు చేయడం పట్ల ఆత్మకూరుMHPS కమిటీ ఖండించడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలపై దాడులు చేయడం, కేసులు బనాయించడం సరికాదని జరిగిన సంఘటనపై నిజా నిజాలు తెలుసుకుని బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఫరూక్ శుబ్లీ గారిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తి తొలగించాలని డిమాండ్ చేయడమైనది.

About Author