PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు

1 min read

– ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్ సి బజారన్న

 పల్లెవెలుగు వెబ్ కర్నూలు:      రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు అధికమయ్యాయని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎన్ సి బజారన్న విమర్శించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలపై అధికార పార్టీ నాయకులు, గుండాలు దాడులు చేస్తున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొలమూరు శివాజీ పై రాష్ట్రమంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ సమక్షంలోనే వైసీపీ గుండాలు దాడి చేసిన ఎలాంటి చర్యలు లేవని, నలుగురు యువకులు దళిత యువకునిపై మూత్ర విసర్జన చేసిన చర్యలు లేవని, అలాగే చిత్తూరు జిల్లాలో ప్రజలకు రక్షణగా ఉన్న పోలీసు అధికారిపై వైసీపీ గుండాలు దాడి చేశారని కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని గతంలో దళితులకు ఇచ్చిన భూములకు వైసీపీ నాయకులు దౌర్జన్యం చేసి ఆక్రమించిన చర్యలు లేవని  అధికార పార్టీ నాయకుల అనుచరులు చేస్తున్న అరాచకాలకు ముగింపు పలకనిచో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం గలమని హెచ్చరించారు.

About Author