PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భాష్యం స్కూల్లో అట్టహాసంగా స్పోర్ట్స్ కార్నివాల్ వేడుకలు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో  జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలు పురస్కరించుకొని బుధవారము ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కార్నివాల్  వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  ముందుగా ప్రిన్సిపల్ మాచాని కవిత క్రీడాజ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ మీటీని ప్రారంభించారు.  విద్యార్థులు కాగడ ర్యాలీని చేపట్టి,  విద్యార్థులు మార్చి ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ ఈ నెల 26 వ తేది రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని వారం రోజులు పాటు స్పోర్ట్స్ కార్నివాల్ మీట్ ఉంటుందని చెప్పారు.   ప్రతిరోజు విద్యార్థులకు .ఆటలు ఫోటోలు నిర్వహించి రిపబ్లిక్ డే రోజు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు ఆరోగ్యానికి  మానసికల్లాసానికి ఎంతో దోహడ్పడుతాయని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చాంప్స్ ఇంచార్జ్ అనురాధ, అధ్యాపక అధ్యాపకేతర బృందం తదితరులు పాల్గొన్నారు.

About Author