PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాత్రికేయం పై దాడికి యత్నం

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది క్షేత్రం లో ఒక మీడియా మిత్రుని పై దాడికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. పుణ్యక్షేత్రం లో పనిచేసే కొందరు ఉద్యోగుల పనితీరు సరిగా లేకపోవడంతో ఇటీవల ఆలయ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆలయ ఉద్యోగి ఒకరు తనకు షోకాజ్ జారీకి కారణం గా భావిస్తూ ఒక మీడియా కు సంబంధించిన విలేకరి (పల్లెవెలుగు కాదు)ని బెదిరిస్తూ దాడికి యత్నించాడు. తనపై వార్తలు రాస్తే తడాఖా చూపిస్తామని హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

About Author