PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశం విడిచి వెళ్లే య‌త్నం.. బాలీవుడ్ న‌టికి అడ్డగింపు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ముంబ‌యి ఎయిర్ పోర్ట్ లో అధికారులు అడ్డుకున్నారు. మ‌నీలాండ‌రింగ్ కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న ఆమె భార‌త్ వ‌దిలి విదేశాల‌కు వెళ్లే ప్రయ‌త్నం చేశారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన నేప‌థ్యంలోనే ఆమెను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. 200 కోట్లకు సంబంధించిన ఓ మ‌నీలాండ‌రింగ్ కేసు విచార‌ణ జ‌రుపుతోన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. సుకేష్ చంద్రశేఖ‌ర్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా చార్జిషీటులో పేర్కొన్నారు. చార్జిషీటులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తోపాటు, నోరా ఫ‌తే పేర్లను కూడ పేర్కొన్నారు. ఈ కేసులో జాక్వెలిన్ ను ప‌లుమార్లు ఈడీ ప్రశ్నించింది. 10 కోట్ల విలువైన బ‌హుమ‌తులు తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై జాక్వెలిన్ కు ఈడీ నోటీసులు పంపినట్టు స‌మాచారం. దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

About Author